సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కాని సినిమా షూటింగ్ కు సంబందించిన అప్డేట్స్ మాత్రం బయటకు రాలేదు.
లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఈవెనింగ్ 4:05 నిమిషాలకు క్రేజీ అప్డేట్ తో వచ్చారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది.
ఇంతకీ మహేష్ కానుకగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే.సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని కన్ఫర్మ్ చేయడమే కాకుండా సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా మరోసారి తమన్ ను ఫిక్స్ చేశారు.
ఈ అప్డేట్స్ తో పాటుగా SSMB28 టీం తరపున సూపర్ స్టార్ మహేష్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ అందించారు.త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మరో సూపర్ హిట్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు.
త్రివిక్రం, మహేష్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో చాలా స్పెషల్స్ ఉంటాయని మాత్రం అర్ధమవుతుంది.