టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12 న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.
సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది .ప్రస్తుతం మహేష్ బాబుతో పాటు సర్కారు వారి పాట చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా మహేష్బాబు తన నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన మేజర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ మేజర్ సినిమా చూస్తున్నప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని, సినిమా చూసిన తర్వాత గొంతు తడారిపోయింది అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్.వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాకి.
ఆయనే స్వయంగా కథ – స్క్రీన్ ప్లే అందించారు.గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.ఈ సినిమా టీమ్ ని చూస్తే గర్వంగా వుంది.
మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది.ఈ సినిమా చూశాను.కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి.చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది.సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను.రెండు నిమషాల మౌనం తర్వాత అడవి శేష్ ని హాగ్ చేసుకున్నాను అని అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.
అయితే బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నదని,మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది అని తెలిపారు.ఇకపోతే ఈ సినిమా జూన్ 3న విడుదల కాబోతోంది.ఆ తరువాత మహేష్ మాట్లాడుతూ అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని అన్నారు.బ్రదర్.నేను అసలు రిస్క్ లు తీసుకోను.నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.