టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుపుకున్నారు.ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా గోవాలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఒక యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభమైన గోవా షెడ్యూల్ షూటింగ్ మరొక యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయింది.ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తికావడంతో హీరో మహేష్ బాబు తిరిగి గోవా నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.
పరుశురామ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్,జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు ఈ సినిమా తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే.