మామూలుగా షాపింగ్ చేసేవారు డిస్కౌంట్ ఆఫర్లు ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.ఒక్కసారి డిస్కౌంట్ ఆఫర్ వస్తే దాదాపుగా షాప్ మొత్తం దోచేసే పనిలో పడతారు.
మరికొందరైతే అవసరం లేకుండా సరే తక్కువకి వస్తున్నాయి కదా అని కోరుకుంటూ ఉంటారు.అయితే తాజాగా ఓ రిటైల్ స్టోర్ కంపెనీలో జరిగినటువంటి చిన్న తప్పిదం వల్ల ఆ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి కస్టమర్లు.
వివరాల్లోకి వెళితే ప్రెంచ్ దేశానికి సంబంధించి నటువంటి జెయింట్ క్యాసినో అనే రిటైల్ స్టోర్ లో టీవీలపై భారీ రాయితీలను ప్రకటించారు.ఇందులో భాగంగా ఓ టీవీ 399 యూరోలు ఉండగా కానీ 39.9 యూరో లని పొరపాటుగా ముద్రించారు.ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు ఒక్కొక్కరూ దాదాపుగా నాలుగైదు టీవీలను తీసుకుంటూ డబ్బులు చెల్లించడానికి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లారు.దీంతో క్యాష్ కౌంటర్ వద్ద ఇచ్చిన బిల్లును చూసి ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ఖంగు తిన్నారు.39.9 యూరోల విలువగల టీవీకి 399 యూరొలు చెల్లించమనడం ఏంటని ప్రశ్నించారు.అయితే అప్పుడు కంపెనీ అధికారులు ఒకసారి ఇ డిస్కౌంట్ ఆఫర్ ను చెక్ చేయగా ఆఫర్ శాతాన్ని ముద్రించే సమయంలో చిన్న పొరపాటు జరిగిందని కావున తమని క్షమించాలని కోరారు.
అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు చేసిన ఈ చిన్న తప్పిదానికి కస్టమర్లు అరిచి గోల చేశారు.అంతేగాక కంపెనీ ప్రకటించినటువంటి ఆఫర్ ధరకే తమకు అందజేయాలని భీష్మించుకుని కూర్చున్నారు.దీంతో పరిస్థితిని అదుపు చేయలేక స్టోరీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.అలాగే స్టోర్ నిర్వాహకులు కూడా తమ తమ కంపెనీ లో జరిగినటువంటి ఈ చిన్న తప్పిదానికి మన్నించాలని క్షమాపణలు కోరారు.
.