సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్యకాలంలో పొలిటికల్ గా కూడా యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే.తమిళనాడు రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించిన రజినీకాంత్ దానికి సంబంధించి అభిమానులతో ఎప్పటికప్పుడు చర్చలు నడుపుతూ వస్తున్నారు.
పార్టీ ప్రకటించడానికంటే ముందే కార్యకర్తలని సిద్ధం చేసుకొని, క్రింది స్థాయి నుంచి క్యాడర్ బిల్డ్ చేసుకునే పనిలో పడ్డ రజినీకాంత్ ఇప్పుడు అఫీషియల్ గా పార్టీ పేరు ప్రకటించడానికి సిద్ధమయ్యారు.దీనికి సంబంధించి నేడు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఇక ఈ పార్టీ ప్రకటన కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు తమ బాస్ ఎలాంటి పేరు ప్రకటిస్తారు అనేదానిపై ఉత్సాహంగా వేచి చూస్తున్నారు.పార్టీ పేరు ఏదైనా తమ అభిమాన కథానాయకుడుని తమిళనాడు ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులు అందరూ కార్యరంగంలో సిద్ధమై ఉన్నారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగిన కూడా సిద్ధమనే విధంగా సంకేతాలు ఇచ్చారు.పార్టీని అఫీషియల్ గా ఈ రోజు ప్రకటించి, ఏప్రిల్ 14న అభిమానుల మధ్య పార్టీ జెండాని, గుర్తుని భారీ బహిరంగ సభలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
మరి తమిళనాడులో రాజకీయ చదరంగంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది.
.