సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి అందరికి తెలిసిందే.ఆయన తన నటనతో గుర్తింపు పొందాడు.
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ,బెంగాలి, ఆంగ్ల భాష లలో నటించి తనదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాగా ఇటీవలే రజినీకాంత్ సినిమా విడుదలకు డేట్ ను ఫిక్స్ చేయగా అభిమానులకు శుభవార్తెనని తెలిపారు.
శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అన్నాత్తే’ సినిమాలో రజనీకాంత్ కథానాయకుడిగా, నయనతార కథానాయికగా ఈ సినిమాలో నటించారు.ఇది ఇది రజనీకాంత్ కు 168 సినిమాగా గుర్తింపు వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 4న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రకటించారు.ఈ సినిమా దాదాపు పూర్తి అయింది.కానీ ఈ సినిమా విడుదలకు ఇంత సమయం పట్టడంతో ఓ కారణం ఉంది.సినిమా షూటింగ్ మధ్యలో రజనీకాంత్ కు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి.
కాబట్టి ఈ సినిమాకు చాలా రోజులు వాయిదా పడగా ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా ఈ సినిమా మధ్యన కొన్ని సమస్యలు ఎదురవ్వగా దాని వల్ల మరింత ఆరోగ్య సమస్య తో బాధ పడగా వైద్యం కోసం అమెరికాకు వెళ్లారు.కాగా ఈ సినిమాలో దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ఓ పాటను పాడగా.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సినిమాతో బాలసుబ్రహ్మణ్యం గారి పాట మళ్లీ వినబోతున్నాం. కాగా ఈ సినిమా మొదటి పాటను బాలసుబ్రహ్మణ్యం గారితో ఇదివరకే పాడించారు.
ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు.మొత్తానికి ఈ సినిమా ఈ ఏడాదిలో దీపావళి సమయాన విడుదలవుతుందని చిత్ర బృందం తెలిపారు.