ఆది సాయి కుమార్ హీరోగా మాటల రచయిత అబ్బూరి రవి మొదటి సరి విలన్ గా కనిపిస్తున్న చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్.సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎయిర్ టెల్ భామ షాష చెత్రి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
ఇదిలా వుంటే టెర్రరిజం నేపధ్యంలో నడిచే కథతో యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.ఇక ఇందులో హీరో ఆది సాయి కుమార్ ఓ ఎన్ఎస్జీ కమాండో పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇదిలా వుంటే శివరాత్రి రోజున ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ సూపర్ స్టార్ మహేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించింది.
ఇంటరెస్టింగ్ పాయింట్ తో, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఇండో, పాక్ టెర్రరిజం నేపధ్యంలో నడుస్తునంట్లు టీజర్ బట్టి తెలుస్తుంది.
అలాగే ఇది నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ కథ నడుస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో కెరియర్ లో దారుణంగా పడిపోయిన ఆది హీరో గా పవర్ ఫుల్ కాప్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా అతనికి మళ్ళీ ఎ రేంజ్ సక్సెస్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.