టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని వంద కోట్ల హీరోగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన మొదటి ప్రాధాన్యత ఎప్పుడు తెలుగు సినిమాలకే ఇస్తాడు.బాలీవుడ్ సినిమాలకి సరిపోయే చరిష్మా ఉన్న కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయడు.
మిగిలిన స్టార్ తెలుగు హీరోలు అందరూ తమ మార్కెట్ ని విస్తరించుకోవడానికి వారి సినిమాలని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.ఆ దారిలో యూనివర్శల్ హీరోలుగా మారుతున్నారు.
అయితే మహేష్ బాబు మాత్రం తన సినిమాలు కేవలం తెలుగుకి పరిమితం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నడియావాలా మహేష్ బాబు ముందుకి అదిరిపోయే ఆఫర్ ని పెట్టాడు.
ఒక పాన్ రణవీర్ సింగ్ తో కలిసి ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా చేయాలని రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తానని మహేష్ బాబుకి చెప్పాడట.అయితే మహేష్ బాబు ఆలోచించి చెబుతానని చెప్పి వారి నుంచి తప్పించుకున్నాడు.
తరువాత ముంబై నుంచి వచ్చాక తనకి బాలీవుడ్ సినిమాలలో చేసే ఆలోచన లేదని సున్నితంగా తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తుంది.గతంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రాధాన్యత ఎప్పుడు తెలుగు సినిమా మాత్రమే అని చెప్పాడు.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో అదిరిపోయే అవకాశం వచ్చిన వద్దని చెప్పెసినట్లు సమాచారం.