సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి స్పీడ్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట.పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది.
అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్ షెడ్యూల్ ఖరారు కాలేదు.ఫస్ట్ షెడ్యూల్ ని అమెరికాలో స్టార్ట్ చేయాలని దర్శకుడు పరశురామ్ భావించారు.
నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.అయితే మళ్ళీ ఏమైందో ఏమో కానీ సినిమా షెడ్యూల్ వాయిదా వేశారు.
జనవరి ఫెస్టివల్ తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.అమెరికాలో 45 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది.
ఈ షూటింగ్ లో మెజారిటీ సినిమా కంప్లీట్ అయిపోతుంది.తరువాత ఇండియాలో సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.అలాగే బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.అరవింద్ స్వామి మహేష్ బాబుకి ప్రతినాయకుడుగా నటించబోతున్నాడు.ఇక బ్యాంక్ ల సొమ్ములు రుణాల మాటున దొబ్బేసి విదేశాలు పారిపోయిన కార్పొరేట్ వ్యాపారులే లక్ష్యంగా ఈ సినిమా కథ ఉండబోతుంది అని టాక్.
ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.మరి ఇన్ని హంగులతో తెరకెక్కబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.