పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన “వకీల్ సాబ్” అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో “అయ్యప్పన్ కోషియం” రీమేక్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో సందడి చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి చేసుకుందని సమాచారం వినబడుతుంది.కరోనా కారణం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో తిరిగి చిత్ర బృందం నిన్నటి నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని మేకర్స్ రివీల్ చేయడంతో ఈ సినిమాకు ఎనలేని హైప్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.
ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చిత్రబృందం కేవలం సినిమా లోకేషన్ ఫోటో, అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నట్టు వంటి పాత్ర “భీమ్లా నాయక్” అనే పేరును రివీల్ చేశారు.ఈ విధంగా ఒక్క పేరుతోనే పవన్ కళ్యాణ్ సినిమాకు ఎనలేని హైప్ రికార్డ్ కావడం గమనార్హం.పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా కూడా వకీల్ సాబ్ సినిమా మాదిరిగానే రీమేక్ అయినప్పటికీ, చాలా ఆలస్యంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా దర్శకుడు సాగర్ చంద్ర టేకింగ్ పై రోజురోజుకు ఆడియన్స్ లో మరింత నమ్మకం పెరుగుతూ సినిమాపై అంచనాలను పెంచుతోందని చెప్పవచ్చు.