ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ కుమార్ నటన గురించి అందరికీ తెలిసిందే.ఆయన తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు.
తమిళం స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.ఈయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.
అంతే కాకుండా నిజ జీవితంలో అజిత్ మంచి షూటర్ గా గెలుపొందాడు.అంతేకాకుండా బైక్ రేసింగ్, ఎయిరో స్పోర్ట్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది.
1992 ప్రేమ పుస్తకం సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయం అయ్యాడు.ఆ సినిమాతో మంచి విషయం తెచ్చుకున్న అజిత్ వరుస సినిమాలలో బాగా నటించారు.
ఇక ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వలిమై‘ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇటీవల ఈ సినిమా పట్ల అజిత్ అసంతృప్తి చెందిన వార్తలు కూడా వచ్చాయి.
ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటనలు బయటకు సినీ బృందం గానీ, అజిత్ గానీ ఇప్పటివరకు తెలియ చేయకపోవడం తో అజిత్ అభిమానులు ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లను వెల్లడించలేదని ఒత్తిడి చేశారు.అంతే కాకుండా కొందరు వాల్ పోస్టర్ లనే ముద్రించారు.దీని గురించి అజిత్ స్పందించగా అసంతృప్తికి గురయ్యానని తెలిపాడు.
ఇక త్వరలోనే ఈ సినిమా ప్రకటనను దర్శక నిర్మాతలతో చర్చించి సందర్భం చూసుకుని తెలుపుతానని, అప్పటివరకు ఎటువంటి గొడవలు చేయవద్దని అజిత్ తెలిపాడు.
ఇదిలా ఉంటే అజిత్ మరో స్టార్ హీరోయిన్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.2007లో సూపర్ హిట్ అయినా బిల్లా సినిమా మళ్లీ రానుంది.ఇక ఈ సినిమాలో అజిత్ డాన్ గా కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుందట.