యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను ‘పలాస’ మూవీ ఫేం డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబు అనే పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ రోజున మంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.
ఇక ఈ సినిమాను చూసినవాళ్లు ఈ సినిమాలోని క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొస్తున్నారు.ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచినట్లు తెలుస్తోంది.
క్లైమాక్స్లో సుధీర్ బాబు చేతిలో కొడవలి పట్టుకుని నరేష్ ముందు కూర్చుని మాట్లాడుతాడు.ఈ సీన్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
ఈ సీన్ను చాలా మంది మెచ్చుకుంటుండగా, ఇది సినిమాకు హైలైట్గా నిలిచిందని, ఇందులో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు.ఏదేమైనా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉండటంతో, ఈ సినిమాను చూసేందుకు వారు ఆసక్తిని చూపుతున్నారు.
కాగా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా నటించింది.గోదావరి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దడంతో, ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.
మరి ఈ సినిమా టోటల్ రన్లో ఎలాంటి రిజల్ట్ను రాబడుతుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.ఈ సినిమా 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేయగా, మణిశర్మ సంగీతం అందించాడు.