ఒక సెలబ్రటి అన్నప్పుడు సామాజిక బాధ్యత ఖచ్చింతంగా ఉండాలి.ఎందుకంటే వారిని అనుసరించేవారు చాలామంది ఉంటారు.
వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తూ అనుకరించే వెర్రి అభిమానులు ఉంటారు.అందుకే సెలబ్రిటీలు తాము ఏం చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించి చేయాలి.
గుట్కా ప్రకటనల్లో నటించవద్దని ఢీల్లీ గవర్నమెంటు అడిగిన వెంటనే, ఇకనుంచి సమాజానికి హాని చేకూర్చే ఏ ఉత్పత్తిని ప్రమోట్ చేయనని ప్రకటించింది సన్నీ లియోన్.అలాంటి ప్రకటనల ద్వారా తనకొచ్చే డబ్బులు కూడా వదిలేసుకోని సన్ని తీసుకున్న ఈ నిర్ణయానికి జై కొట్టారు భారత ప్రజలు.
కాని ఇదే ఢిల్లీ గవర్నమెంటు బాలివుడ్ హీరోలైన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, గోవిందా, అర్బాజ్ ఖాన్ లను, అలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయకండి అని వేడుకుంటే ఎలాంటి సమాధానం రాలేదు.చివరకి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం సదరు హీరోల భార్యలకి లేఖలు పంపి వారం దాటినా లాభం లేకుండాపోయింది.
సన్ని లీయోన్ లాగా అలోచించి బాధ్యతగల నిర్ణయం తీసుకోవాల్సిందిపోయి .గవర్నమెంటు లేఖలను కూడా బేఖాతరు చేస్తున్నారు.
దీన్ని బట్టి మనకి అర్థం అయిన విషయం ఏమిటి ? సన్ని లియోన్ కి ఉన్న బుద్ధి ఆ హీరోలకి లేదు.