సన్నీ లియోన్ యువత లో ఈ పేరు తెలియని వారు లేరు.ఈమె బాలీవుడ్ లోకి రాకముందు పోర్న్ వీడియో లు చేసినప్పటికీ సినిమాల్లోకి వచ్చాక ఐటమ్ సాంగ్స్ తో పాటు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తూ కుర్రకారు హృదయాలను దోచేస్తుంది.
ఆమెకి తన సినిమా కెరీర్ ప్రారంభం లో చాలానే అవమానాలు జరిగినప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె మంచి గుర్తింపును సంపాదించుకుంది.సన్నీ లియోన్ అందంగా ఉండడమే కాదు ఆమె మనస్సు కూడా అందమైందే.
కొన్నాళ్ల క్రితం సన్నీ ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తన గొప్ప మనసుని చాటుకుంది.దీనితో పాటు చాలా స్వచ్చంద సంస్థలకు విరాళాలు కూడా ఇచ్చింది.
అయితే ఇటీవల జరిగిన ఒక టీవీ షో లో సన్నీ లియోన్ కన్నీళ్లు పెట్టుకుంది.అసలు విషయానికొస్తే
సన్నీ లియోన్ ఇటీవల జరిగిన ఆర్బాజ్ ఖాన్ టీవీ షో లో గెస్ట్ గా వెళ్ళింది.
అక్కడ తను మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది దానికి కారణం తన దగ్గర పనిచేసిన ప్రభాకర్ అనే వ్యక్తిని గుర్తు చేసుకోవడం.దాదాపు సంవత్సరం క్రితం కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రభాకర్ చనిపోయాడు.
అయితే ఆ టీవీ షో లో సన్నీ మాట్లాడుతూ ప్రభాకర్ మాకు ఎంతో కావలిసిన వ్యక్తి అతను మా దగ్గర పని చేస్తున్న వ్యక్తి అనేదానికంటే మా కుటుంబ సభ్యులలో ఒకరు అనడానికే ఇష్టపడుతా అని తెలిపింది.అలాగే తన రెండు కిడ్నీ లు చెడిపోయాయని తనకి తెలిసిన వెంటనే తను , తన భర్త డేనియల్ ఎలాగైనా అతనికి సహాయం చేయలనుకున్నాం అందుకే తన సోషల్ మీడియా ద్వారా డబ్బుల కోసం డొనేషన్ అడిగాను అని తెలిపింది.
కానీ అతన్ని మేము బతికంచులేదు , ప్రస్తుతం అతను మాతో లేడని బాధగా ఉంది .అతను గుర్తొచ్చినపుడల్లా అతన్ని కాపాడుకోలేకపోయాను అనే బాధ తనకి ఎక్కువగా అనిపిస్తుంది అని తెలిపి షో లో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది.
సోషల్ మీడియా లో సన్నీ లియోన్ పైన ట్రోలింగ్ ఈ విషయం గురించి సోషల్ మీడియా లో సన్నీ లియోన్ ని చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.మీకు ప్రభాకర్ ని కాపాడుకోవాలని ఉంటే మీరే అతని ఖర్చులు సొంతగా పెట్టుకుంటే బాగుండేది అని , మరికొందరు కార్ కొనడానికి 1.50 కోట్లు ఉంటాయి కానీ మనిషి ప్రాణాన్ని కాపాడడానికి 20 లక్షలు ఉండవా ? అంటూ కామెంట్ లు చేశారు.ఈ కామెంట్ లు అన్ని ఆమె ప్రభాకర్ ఆసుపత్రి ఖర్చుల కోసం సోషల్ మీడియా లో డోనేషన్లు అడిగా అని చెప్పినందుకు.
ఆమె ప్రభాకర్ కోసం ఫేసుబుక్ లో డొనేషన్ లు ఇవ్వండి అంటూ ఫోటో పెట్టినప్పుడు కూడా ఈ విధంగానే నెటిజన్లు స్పందించారు.