బాలీవుడ్ నటుడు,బీజేపీ నేత అయిన సన్నీ డియోల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమైంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన సన్నీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నేపథ్యంలో గురుదాస్ పూర్ లో జరిగే ఏ సమావేశాలు కానీ,కార్యక్రమాలకు గానీ నా తరఫును నేను నియమించిన వ్యక్తి హాజరవుతారు అని పేర్కొంటూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.మొహాలి జిల్లాకు చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని నా ప్రతినిధిగా నియమిస్తున్నా.
ఇక నుంచి గురుదాస్ పూర్ నియోజకవర్గంలో జరిగే అన్ని సమావేశాలు, కార్యక్రమాలకు నా తరఫున గురుప్రీత్ హాజరవుతారని సన్నీ డియోల్ రాసిన లేఖ సారాంశం.అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర దుమారమే రేగుతోంది.
సన్నీ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
ఎన్నికల్లో తనని గెలిపించిన ప్రజల్ని సన్నీ డియోల్ వంచిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.దీనితో సన్నీ ప్రతినిధి గురుప్రీత్ సింగ్ స్పందిస్తూ కేవలం స్థానిక సమస్యల పరిష్కారం కోసమే నని, ప్రతి నెల ఎంపీ గారు స్వయంగా గురుదాస్ పూర్ వచ్చి పర్యటించి సమస్యలు తెలుసుకుంటారు అని వివరణ ఇస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.