టాలీవుడ్ సినీ పరిశ్రమ సింగర్ సునీత గురించి తెలియనివారుండరు.అయితే ఈమె ఒకపక్క పలు చిత్రాల్లో పాటలు పాడుతూనే మరోపక్క షోలు, ఈవెంట్లలో కూడా జడ్జి గా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే తాజాగా సింగర్ సునీత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తెలుగులో అనతికాలంలోనే మంచి పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నాలుగో సీజన్ లో సింగర్ సునీత కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
అయితే నటన పరంగా ఇంతకు ముందే సినిమాల్లో ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ సింగర్ సునీత మాత్రం నటన వైపు ఎందుకో ఆసక్తి చూపడం లేదు.
అలాంటిది బిగ్ బాస్ షోలో సింగర్ సునీత పాల్గొంటుందా.? అంటూ పలు ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి.కాగా సింగర్ సునీత బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నట్లు సునీత గాని, లేదా షో నిర్వాహకులు గాని ఇప్పటి వరకు సరైన స్పష్టత ఇవ్వలేదు.
దీంతో సునీత బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొంటున్నట్లు వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్ వైపు దూసుకుపోతున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ లో వ్యాఖ్యాతగా టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వ్యాఖ్యాతల లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.