టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు కూడా న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే సునీత రెండవ వివాహం తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే ఏదో ఒక పోస్ట్ ద్వారా సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సునీత సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.సునీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మణిశర్మ, కీరవాణితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోని షేర్ చేసిన సునీత ఈ ముగ్గురు తనకు ఎన్నో అవకాశాలు కల్పించారని తాను జీవితాంతం ఈ ముగ్గురికి రుణపడి ఉంటానని రాసుకొచ్చారు.అదేవిధంగా నా సింగింగ్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం నాకు ఎన్నో అవకాశాలు కల్పించిన లెజెండ్స్ కు తాను ఎల్లప్పుడు కృతజ్ఞతతో ఉంటానని ఈమె చెప్పుకొచ్చారు.
ఈ విధంగా సునీత తన కెరియర్ లో ఎంతో కీలకమైన ఈ ముగ్గురు గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే సునీత మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత గత ఏడాది ఈమె తన స్నేహితుడు మ్యాంగో మీడియా అధినేత రామ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈమె రెండో వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటున్నారు.