మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సునీల్లు మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కెరీర్ ఆరంభంలో ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు.
ఇద్దరు కూడా ఒకే రూంలో ఉండి సినిమాల్లో ప్రయత్నాలు చేశారు.ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లోనే టాప్ దర్శకుడు కాగా, సునీల్ కూడా మంచి కమెడియన్గా గుర్తింపు దక్కించుకున్నాడు.
అయితే సునీల్ కమెడియన్గా స్టార్డం ఉన్న సమయంలోనే హీరోగా అవకాశాలు రావడంతో కామెడీ వేశాలు మానేశాడు.ఆ సమయంలోనే సునీల్ హీరోగా మంచి ఆఫర్లు దక్కించుకోలేక పోయాడు.
దాంతో మళ్లీ కమెడియన్గా ఛాన్స్ల కోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు
కమెడియన్గా మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సునీల్ ఈమద్య కాలంలో త్రివిక్రమ్తో తనకున్న అనుబంధంను తెగ వాడేసుకుంటున్నాడు.పదే పదే త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ నలుగురిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అందుకే రూంలో ఉన్న సమయంలో త్రివిక్రమ్ అలా, నేను ఇలా, త్రివిక్రమ్ అలా కష్టాలు పడ్డాడు అంటూ త్రివిక్రమ్ గురించి చెబుతూ వస్తున్నాడు.తాజాగా త్రివిక్రమ్ గురించి మరో ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.
సునీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రివిక్రమ్ వద్ద 2000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అయ్యే కథ ఉందని చెప్పుకొచ్చాడు.ఆ కథ నాకు చాలా ఏళ్ల క్రితం చెప్పాడు.ఆ సమయంలో అది 500 కోట్ల రూపాయలతో అయ్యేది, కాని ఇప్పుడు ఆ సినిమా పూర్తి చేయాలి అంటే రెండు వేల కోట్లు కావాల్సిందే అంటున్నాడు.సునీల్ మాటలు చాలా అతిశయోక్తిగా అనిపిస్తున్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సునీల్ పబ్లిసిటీ కోసం ఇలా త్రివిక్రమ్ పేరును వాడుకుంటున్నాడు అంటున్నారు.త్రివిక్రమ్ విషయంలో సునీల్ మరీ ఓవర్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది.