టాలీవుడ్ లో కమెడియన్ సునీల్, దర్శకుడు త్రివిక్రమ్ రూమ్ మెట్స్ అనే విషయం చాలా మందికి తెలుసు.ఇక త్రివిక్రమ్ సినిమాల ద్వారానే సునీల్ కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
హీరోగగా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సునీల్ ని తన సినిమాలలో పిలిచి మరీ త్రివిక్రమ్ అవకాశం ఇచ్చాడు.ఇదిలా ఉంటే చిత్రలహరి సక్సెస్ తర్వాత సునీల్ పలు మీడియాలకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
వీటిలో త్రివిక్రమ్ గురించి సునీల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
త్రివిక్రమ్ సునీల్కి బోలెడన్ని కథలు చెప్పాడని అందులో 500 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే భారీ సినిమా కూడా ఉందని సునీల్ గుర్తు చేసుకున్నాడు.
ఆ కథ ఇప్పుడు తీయాల్సివస్తే ఏకంగా 2000 కోట్లు అవుతాయని సునీల్ చెప్పుకొచ్చాడు.త్రివిక్రమ్ ఇప్పుడున్న స్థానం చాలా తక్కువ అని.తాను ఇంకా ఎత్తుకు ఎదుగుతాడని ఊహించాను.ఒకట్రెండు సినిమాలు తీసిన తరవాత బాలీవుడ్ కి వెళ్లిపోతాడనుకున్నాను అంటూ ఆసక్తికరమైన విషయాలు ఎన్నో షేర్ చేసుకున్నాడు.