టాలీవుడ్ సినీ పరిశ్రమలో కమెడియన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఎన్నో కడుపుబ్బా నవ్వించే సినిమాలలో నటించాడు సునీల్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ సినిమాలు కూడా చేసాడు.హీరోలుగా చేస్తున్న సమయంలో కమెడియన్ గా నటించడం మానేసాడు.
ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఈ మధ్యనే హీరోగా చేస్తూనే కమెడియన్ గా కూడా చేస్తున్నాడు.
అల్లు అర్జున్ అల వైకుంఠపురములోసినిమాలో సునీల్ కమెడియన్ గా నటించి మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం సునీల్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న సినిమా కనబడుట లేద .ఈ సినిమాలో సునీల్ పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించ నున్నాడు.ఈ సినిమాను కొత్త దర్శకుడు బాలరాజు ఎం డైరెక్ట్ చేసాడు.ఈ సినిమాను నిర్మాతలు సతీష్ రాజు, దేవిశ్రీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో ఓటిటీ లో ఆగస్టు 13 న విడుదల చెయ్యాలి అని అనుకున్నారు.కానీ మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో ఓటిటీ రిలీజ్ వాయిదా వేశారు.ఈ నెల 19 న థియేటర్స్ లోనే విడుదల చేయాలనీ నిర్ణయించింది చిత్ర యూనిట్.ప్రస్తుతం ఈ సినిమాను జనాల్లోకి చేర్చడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో నిర్వహించారు.
కానీ ఈ ఈవెంట్ లో సునీల్ ఎక్కడ కనపడక పోవడంతో అందరు ఇప్పుడు సునీల్ ఎందుకు ఆరుష్యం అయ్యాడా అని ఆలోచిస్తున్నారు.అయితే టైటిల్ కనబడుట లేదు అని పెట్టుకున్నందుకు కనబడలేదా అని కూడా ఆలోచిస్తున్నారు కానీ సునీల్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నందున ఈవెంట్ లో పాల్గొనలేదని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ముందు ముందు కూడా ప్రమోషన్స్ లో సునీల్ కనిపించక పోతే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళదు అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.