కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా అందరూ ఇళ్లకే అతుక్కుపోయిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఈ లాక్డౌన్ అమలులో ఉండటంతో ప్రముఖుల దగ్గర్నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇక ఈ లాక్డౌన్ చాలా మందికి చాలా కష్టాలను తీసుకొచ్చింది.ముఖ్యంగా కరెంట్ బిల్లుల రూపంలో ఈ లాక్డౌన్ తెచ్చిన తంటాలు అంతా ఇంతా కాదు.
సామాన్య ప్రజల దగ్గర్నుండి సెలబ్రిటీల వరకు లాక్డౌన్ కారణంగా అధిక విద్యుత్ బిల్లులు చెల్లించక తప్పడం లేదు.విద్యుత్ మీటర్ రీడింగ్ సిబ్బంది కరోనా కారణంగా తమ విధులు చేయబోరని, మూడు నెలలకు గాను యావరేజ్ రూపంలో బిల్లులు వస్తాయని విద్యుత్ అధికారులు ప్రకటించారు.
కానీ వారు చెప్పిన దానికి, బిల్లులు వచ్చిన తీరుకి చాలా తేడా ఉంది.ఈ సమస్య పలానా రాష్ట్రంలో అని కాకుండా దేశవ్యాప్తంగా నెలకొంది.ఇక ఈ విద్యుత్ బిల్లుల బాధితుల్లో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.
ఇటీవల కార్తీకా నాయర్, తాప్సీలు తమ విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని కుర్రోమొర్రో అన్నారు.
అయినా వారి బాధలను ఎవరూ పట్టించుకోలేదు.ఇక తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ విద్యుత్ బిల్లు బాధితుడిగా మారాడు.
తనకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే ఇదేదో వీకెండ్ సినిమా కలెక్షన్లలా ఉందని ఆయన సెటైర్ విసిరాడు.విద్యుత్ బిల్లుల కోసం ఆన్లైన్ వార్ మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు.
కాగా సందీప్ కిషన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.