హైదరాబాద్ లోని ట్యాంక్బండ్పై సన్డే ఫన్డే వేడుకలు మళ్లీ మొదలు కానున్నాయి.కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత ఈ సెలబ్రేషన్స్ రేపటి నుంచి ప్రారంభంకాఉనన్నాయి.
సెలవు దినం ఆదివారం నాడు క్రమం తప్పకుండా ఈ సన్ డే ఫన్ డే వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.
రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ట్యాంక్బండ్పై సన్డే ఫన్డే వేడుకలు జరగనున్నాయి.
ఈ వేడుకల నేపథ్యంలో ట్యాంక్బండ్పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.ఆ సమయంలో ట్యాంక్బండ్ మీదుగా వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.