తెలుగులో ప్రముఖ దర్శకుడు మధు గోపు దర్శకత్వం వహించిన టువంటి “పెళ్ళికి ముందు ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించిన నటి సునైనా గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు అంతకు ముందు తెలుగులో కుమార్ వెర్సెస్ కుమారి, టెన్త్ క్లాస్ తదితర చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
దీనికి తోడు ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సినీ అవకాశాలను దక్కించుకోలేకపోయింది.
కానీ తమిళ సినీ పరిశ్రమలో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుంటూ కోలీవుడ్ సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది.
ఆ మధ్య కాలంలో ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలను బాగా హల్ చల్ చేసింది. అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తమిళ సినీ పరిశ్రమకి చెందినటువంటి దర్శకుడి తమ్ముడితో కొంతకాలం పాటు ప్రేమాయణం నడుపుతుందని, ఈమె ప్రేమ మైకంలో పడినటువంటి ఆ దర్శకుడి తమ్ముడు ఏకంగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని కొందరు బలంగా చర్చించుకుంటున్నారు.
ఈ విషయంపై మాత్రం ఇప్పటివరకు సునైనా అసలు నోరు విప్పడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సునైనా తమిళంలో ప్రముఖ దర్శకుడు సచిన్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే సునైనా ట్రిప్ అనే చిత్రంలో నటించేందుకు కూడా ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.