మాజీమంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు సమన్లు

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు హత్య కేసులో విచారణ ప్రక్రియను ప్రారంభించింది.

 Summons To Accused In Ex-minister Viveka Murder Case-TeluguStop.com

ఈ మేరకు ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.అదేవిధంగా వివేకా హత్య కేసుకు ఎస్సీ/01/2023 నంబరును కోర్టు కేటాయించింది.

అనంతరం ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, జి ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరితో పాటు డి శివశంకర్ రెడ్డిలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

వీరంతా ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube