మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు హత్య కేసులో విచారణ ప్రక్రియను ప్రారంభించింది.
ఈ మేరకు ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.అదేవిధంగా వివేకా హత్య కేసుకు ఎస్సీ/01/2023 నంబరును కోర్టు కేటాయించింది.
అనంతరం ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, జి ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరితో పాటు డి శివశంకర్ రెడ్డిలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
వీరంతా ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.