దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలికి, రెండోవ భాగం సిద్ధమవుతోంది.40 డిగ్రీల ఎండలో కూడా , చెమటలు కక్కుతూ పనిచేస్తోంది బాహుబలి యూనిట్.ప్రస్తుతం హైదరాబాద్ లో భారి యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యులు మరో పదిరోజుల పాటు కొనసాగుతుంది.అయితే, ఇప్పటికే ఈ ఎండల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న యూనిట్, వేసవి సెలవులు తీసుకోబోతోంది.
హైదరబాద్ లో ఎండలు ధగధగమంటున్నాయి.45 డిగ్రీల వరకు కూడా వెళుతోంది టెంపరేచర్.ఈ నిప్పులుకక్కే ఎండలో పని చేయడం చాలా కష్టంగా ఉందట.
ఏప్రిల్ లోనే ఇలా ఉంటే, ఇక మే నెలలో ఈ ఎండలు మరింత భీకరంగా తయారవుతాయి.అందుకే మే నెల విశ్రాంతి తీసుకోబోతున్నారు బాహుబలి యూనిట్ సభ్యులు.
మే నెల మొత్తం బాహుబలి టీమ్ కి వేసవి సెలవులే.జూన్ నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
ఎన్ని కోట్లు పెడుతున్నా, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.పైగా బాహుబలి మిగితా సినిమాల్లా కాదు.అంత భారి సెట్ల మీద మండుటెండలో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేయడం చాలా అంటే చాలా కష్టం.అందుకే రాజమౌళి ఈ సెలవులు ప్రకటించినట్లు సమాచారం.
సినిమా ఎలాగో వచ్చే ఏడాది ఏప్రిల్ 14కి కదా, పెద్ద తొందరేమి లేదు.
.