ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ సినిమా ద్వారా సుమంత్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నటుడిగా సుమంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
సత్యం, మధుమాసం, మళ్లీరావా సినిమాలు సుమంత్ కెరీర్ లో మంచి హిట్లుగా నిలిచాయి.ప్రస్తుతం సుమంత కపటధారి అనే సినిమాలో నటిస్తుండగా ఈ నెలలోనే ఆ సినిమా విడుదల కానుంది.
అయితే నిన్న వరల్డ్ క్యాన్సర్ డే కాగా హీరో సుమంత్ హైటెక్ సిటీలో ఉన్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని సుమంత్ ప్రారంభించారు.ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తాతగారు అక్కినేని నాగేశ్వరరావు చివరి దశలో క్యాన్సర్ తో పోరాడటం తనకు బాధను కలిగించిందని సుమంత్ అన్నారు.
చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సుమంత్ సూచనలు చేశారు.
యూత్ బ్యాడ్ హ్యాబిట్స్ కు దూరంగా ఉండాలని.తాను సినిమాల్లో పొగ తాగే సన్నివేశాల్లో నటించడం తగ్గించానని సుమంత్ అన్నారు.పాత్రకు అవసరమైతే మాత్రమే సిగరెట్ తాగే సన్నివేశాల్లో నటిస్తున్నానని పేర్కొన్నారు.
తన కుటుంబంలో కొందరు క్యాన్సర్ ను జయించారని కొందరు మాత్రం క్యాన్సర్ వల్ల చనిపోయారని సుమంత్ అన్నారు.క్యాన్సర్ ను తొలిదశలో గుర్తిస్తే సులభంగా బయటపడగలమని సుమంత్ అన్నారు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను యువత అలవరచుకోవాలని సుమంత్ సూచించారు.మరోవైపు సుమంత్ నటించిన కపటదారి సినిమా క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
ఈ నెల 26వ తేదీన కపటధారి సినిమా విడుదల కానుంది.ఈ సినిమాతో పాటు మురళీధరన్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో సుమంత్ నటిస్తున్నట్టు సమాచారం.
ఐమా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.