అక్కినేని కాంపౌండ్ హీరోగా సుమంత్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.సాఫ్ట్ హీరోగా కేవలం సెలెక్టెడ్ మూవీస్ను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.
కాగా ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న సుమంత్, తాజాగా కపటధారి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో రాబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ పనులను ఇప్పటికే ముగించుకోగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేశారు.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు కితాబిచ్చారు.పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కి్స్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాలో సుమంత్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు కీలకంగా కానుందని, ఆయన కనబరిచిన ఎక్స్ప్రెషన్లు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.కన్నడలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘కవటధారి’కి తెలుగు రీమేక్గా సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను దక్కించుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమాను ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తుండగా, ధనంజయన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమాలో అందాల భామ నందితా శ్వేతా, పూజా కుమార్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.గతంలో సుమంత్ నటించిన సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి తన స్ట్రాటెజీ కంటెంట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.
మరి ఈసారి కూడా సుమంత్కు ప్రేక్షకులు పాస్ మార్కులు వేస్తారా లేరా అనేది చూడాలి.