అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత వచ్చిన హీరో సుమంత్.నాగేశ్వరరావు మనవడుగా టాలీవుడ్ లోకి ఆర్జీవీ ప్రేమకథ సినిమాతో సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమాతోనే హిట్ కొట్టి నటుడుగా మెప్పించాడు.తరువాత కొన్ని ఫ్లాప్ లు పడిన సత్యం, గౌరీలాంటి సినిమాలతో సుమంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
అయితే తరువాత కథల ఎంపికలో లోపల కారణంగా వరుస డిజాస్టర్ లతో కెరియర్ ట్రాక్ లో వెనకబడిపోయాడు.అడపాదడపా ప్రతి ఏడాది డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకి సుమంత్ వచ్చిన కూడా పెద్దగా హిట్స్ మాత్రం అందడం లేదు.
రెగ్యులర్ కథలతో హిట్స్ రావడం లేదని కొత్త కథలని సుమంత్ గత కొన్నేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం రావడం లేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఇప్పుడు సుమంత్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వాల్తేర్ శీనుగా ప్రేక్షకుల ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు.అనగనగా ఒక రౌడీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో వాల్తేరు శీను అనే రౌడీ పాత్రలో అతను కనిపిస్తున్నాడు.
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది మనుయజ్న ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో సుమంత్ ఉన్నాడు.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు.దీంతో ఒటీటీలో సినిమాని రిలీజ్ చేయాలా లేదంటే థియేటర్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యే వరకు వేచి చూడాలా అనే ఆలోచనతో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.