సోషల్ మీడియాలో రోజుకో వార్త సంచలనం సృషిస్తోంది.కొంత మందికి ఆ వార్తలు పేరును సంపాదించి పెడితే, మరికొందరికి పరువును తీసేస్తుంది.
ఇక సినీ తారల గురించి చెప్పాలంటే సెకనుకో న్యూస్ వైరల్ కావడం చూస్తూనే ఉంటాం.ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలంటే అభిమానులకు చాలా ఆసక్తి.
అది పెళ్లి కావచ్చు.విడాకులూ కావచ్చు.
అలాంటి వార్తలు విస్తరింపజేయడమే పనిగా మరికొంత మంది పనిచేస్తుంటారు కూడా.ఇక ఇలాంటి విషయాలపై సినీ హీరో సుమన్ తన ధోరణిలో సమాధానం చెప్పారు.
అలా ఈ మధ్య వచ్చిన పుకార్లు, వార్తలపై ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
అదేంటంటే, సామాజిక మాధ్యమాల్లో వివిధ వార్తల గురించి, సినిమాల గురించి ఎలాంటి ఫీలింగ్ లేదు.
కానీ వ్యక్తిగత విషయాలపై వార్తలు ప్రచారం చేయడం మాత్రం చాలా తప్పని సుమన్ అన్నారు.ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ ప్రముఖ వ్యక్తి విషయాలు, ఆయన వ్యక్తిగత విషయాలపై వార్తలొస్తున్నాయి.
వీళ్లకెందుకు ఆ బాధ ? ఎఫెక్ట్ అయిన వాళ్లు వచ్చి ఏమైనా మీకొచ్చి రిక్వెస్ట్ చేశారా ? ఎఫెక్ట్ అయిన వాళ్లు వచ్చి ఏమైనా కంప్లైంట్ చేశారా ? ఎఫెక్ట్ అయిన వాళ్లు వచ్చి ఏమైనా కోర్టుకెళ్లారా ? అది వాళ్లిష్టం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరికీ వాళ్ల వాళ్ల పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.ఒకరితో కలిసి బతకాలంటే, ఉండాలంటే చాలా అండర్స్టాండింగ్ కావాలని సుమన్ తెలిపారు.మధ్యలో విడిపోతారు.మళ్లీ ఇంకో వివాహం చేసుకోవాల్సి కూడా వస్తుంది.మెయిన్గా ఆడవాళ్లు.అది వాళ్ల పర్సనల్ మ్యాటర్.అంటూ ఆయన గట్టిగా వారించారు.
ఇకపోతే తెలుగు, తమిళ, కన్నడ ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ఈయన, నీచల్ కులం కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు.ఈయన అన్నమయ్య సినిమాలో పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసులో రాముని పాత్ర మరపురానివని చెప్పవచ్చు.రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన శివాజీ మూవీతో ప్రతినాయకుడిగా కూడా నటించి ప్రేక్షకుల ఆదరణాభిమానాలను సొంతం చేసుకున్నారు.అంతేకాకుండా 2021లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకుని మరో ఉన్నతమైన మెట్టు ఎక్కి మరో ఘనత సాధించారు నటుడు సుమన్.