సినీ ప్రముఖులను కరోనా భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
కరోనా వల్ల కొందరు సినీ ప్రముఖులు మృత్యువాత కూడా పడ్డారు.ఈ సమయంలో కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన సినీ ప్రముఖులు పరిస్థితి ఏంటా అంటూ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో ఇద్దరు హీరోయిన్స్ కరోనా నుండి బయట పడ్డారు అనే వార్త ప్రస్తుతం అందరిలో ఆనందంను కలిగిస్తుంది.
సీనియర్ హీరోయిన్ చిరంజీవితో పాటు తెలుగులో పలువురు హీరోతో నటించి మెప్పించిన ఎంపీ సుమలత కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ఆమె వయసు కాస్త ఎక్కువ కనుక ఆమె ఆరోగ్యంపై ఆమె అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.కాస్త లేట్గా సుమలత కరోనాను జయించారు.
ఆమె తాజాగా పరీక్ష చేయగా కరోనా నెగటివ్ వచ్చిందట.మరో సారి పరీక్ష చేసిన తర్వాత ఆమెను వైధ్యులు పూర్తిగా బాగయినట్లుగా భావించి పంపిచేస్తారట.
ఇక స్టార్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.వారం రోజుల క్రితం ఐశ్వర్య స్వయంగా తాను కరోనా పాజిటివ్ అంటూ ప్రకటించింది.అయితే అప్పుడే ఆమె కరోనాను జయించింది.తక్కువ వయసు మరియు మంచి ఇమ్యూనిటీ పవర్ ఉన్న కారణంగా ఐశ్వర్య వారం రోజుల్లోనే కరోనా నుండి బయట పడటం జరిగిందటూ వైధ్యులు చెబుతున్నారు.
ఇక అమితాబ్ ఫ్యామిలీ గురించిన సమాచారం రావాల్సి ఉంది.