‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగింది.అభ్యర్థులు పోటా పోటీగా వ్యవహరించి, పరస్పరం వ్యక్తిగత దూషణలకు సైతం పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే సిని‘మా’ రాజకీయాలు అంతటా చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఈ ఎన్నికలపై రాజీవ్ కనకాల స్పందించారు.పోటీలో అభ్యర్థిగా ఉన్న ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ లోకల్, నాన్ లోకల్ అనే అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఈ నేపథ్యంలో అయితే మరి రాజీవ్ కనకాల సతీమణి సుమ కూడా నాన్ లోకల్ కదా.? అనేటటువంటి ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ వార్తలపై స్పందించిన రాజీవ్ కనకాల, రజనీ కాంత్ ఇప్పుడు అక్కడ ఉన్నట్టి 40-50 ఏళ్లు అవుతుంది.ఆయన్ని లోకల్ అంటారా ? నాన్ లోకల్ అంటారా ? లోకల్ అంటారు కదా.అలాగే సుమ వచ్చి 40 ఏళ్లు అయిపోయింది.ఒకవేళ ఆవిడ మలయాళం మాట్లాడి ఉంటే తాను పెళ్లి కూడా చేసుకోబోయే వాన్ని కానని ఆయన అన్నారు.
ఇక విషయానికొస్తే తానెపుడూ ప్రకాష్ రాజ్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాజీవ్ కనకాల తెలిపారు.సోషల్ మీడియాలో హెడ్డింగ్స్ పెట్టేటపుడు కొంచెం ఆలోచించి, ఏం జరిగిందో తెలుసుకొని పెట్టండి ఆయన గట్టిగా చెప్పారు.ఆఖరికి పవన్ కళ్యాణ్ గురించి అన్న మాటలు కూడా తప్పుగా అనువర్తింప జేశారని ఆయన వాపోయారు.అలాగే సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్ట్ లు, కామెంట్స్ పెడుతున్నారని అలా చేయడం తప్పు.
ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి అని రాజీవ్ కనకాల మరోసారి కోరారు.