తెలుగు సినీ నటి, బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల.ఈమె పరిచయం గురించి తెలియని వాళ్ళేవరూ లేరు.
తన యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ యాంకర్ గా నిలిచింది.బుల్లితెరలో ఎన్నో ఏళ్ళనుండి ఉంటూ ఎన్నెన్నో షోలలో తన యాంకరింగ్ తో బాగా సందడి చేసింది.
చేస్తుంది కూడా.తన మాటలతో బాగా అల్లరిస్తుంది.
అంతేకాకుండా సినీ అవార్డు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లలో కూడా హోస్టింగ్ తో మెప్పిస్తుంది.ఇక తన షోకు గెస్ట్ గా వచ్చిన వాళ్లతో ఓ రేంజ్ లో ఆడుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ.ఇటీవలే యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా లాంచ్ చేసింది.అందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లను కూడా అందిస్తుంది.ఇప్పటికీ పలు షోలలో బిజీగా ఉంది సుమ.ఇక తనకు మంచి క్రేజ్ అందించిన షో క్యాష్ అనే చెప్పవచ్చు.ఇందులో తన మాటలను తూటాలుగా పేలుస్తుంది.అంతేకాకుండా సుమకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ న్యూడ్ ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసింది సుమ.
ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న క్యాష్ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది.అందులో బుల్లితెర నటులు శిరీష- సన్నీ, వాసుదేవ్ -కరుణ, పవన్ – అంజలి, విశ్వ- ప్రశాంతి జంటలుగా పాల్గొన్నారు.అంతేకాకుండా ఎంట్రీతో బాగా సందడి చేశారు.ఇందులో సన్నీ స్వామి రారా సినిమా పోస్టర్ ని చూసి ఇందులో కనిపించిన వెస్పా స్కూటీని ఈ సినిమా చూసిన తర్వాత తీసుకున్నానని అనడంతో వెంటనే సుమ మరి టైటానిక్ చూసిన తర్వాత ఏం తీసుకున్నావ్ అని కౌంటర్ వేసింది.
వెంటనే వాసుదేవ్ మాట్లాడుత టైటానిక్ తర్వాత ఆ ఫోజ్ ఉంటుంది కదా అది ట్యాంకుబండ్ మీద ట్రై చేశారు.పోలీసులు అరెస్ట్ చేశారు అని అన్నాడు.వెంటనే సన్నీ మీరు మాట్లాడేది ఏ ఫోజు? బొమ్మ గీశాడు అది కాదు కదా అని అనడంతో వెంటనే సుమ ‘కాదు జాక్ రోజ్ బొమ్మ గీశాడు కానీ.అసలు రోజ్ జాక్ బొమ్మ గీస్తే ఏమయ్యేదో అంటూ ఆ న్యూడ్ ఫోటో పై కామెంట్ చేసింది.
దీంతో అక్కడున్న వాళ్ళంతా తెగ నవ్వుకోగా ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.