చలన చిత్ర పరిశ్రమలో తమిళ భాష తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరోలలో తమిళ్ హీరో కార్తీ ఒకడు.అయితే కార్తీ తెలుగులో యుగానికి ఒక్కడు, దొంగ, కాష్మోరా, ఆవారా, నా పేరు శివ, మల్లిగాడు, ఊపిరి, తదితర చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే అలరించడంతో పాటు తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
కాగా ప్రస్తుతం కార్తీ తమిళం, తెలుగు భాషలో “సుల్తాన్” అనే చిత్రంలో హీరోగా నటించాడు.కాగా ఈ చిత్రంలో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ “రామచంద్ర రాజు” కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న చిత్ర యూనిట్ సభ్యులతో చాలా బాగా కలిసిపోయిందని అందువల్లనే ఎప్పుడు కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లో ఆహ్లాదకరంగా ఉండేదని తెలిపాడు.
అంతేకాకుండా చాలా బాగా అల్లరి కూడా చేసేదని రష్మిక మందన ను భరించడం చాలా కష్టమని కూడా సరదాగా చెప్పుకొచ్చాడు.అలాగే ఆమెతో గడుపుతున్నంతసేపు సమయం అస్సలు తెలియదని అంతగా మైమరపించేస్తుందని కూడా కితాబిచ్చాడు.
ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన రామచంద్ర రాజు కూడా రష్మిక మందన గురించి స్పందిస్తూ ఆమె చాలా ధైర్యవంతురాలని ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆమెను కొట్టే సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో అనుకోకుండా నాలుగు టేకులు తీసుకున్నామని చివరికి రష్మిక మందన నిజంగానే తనని కొట్టమని సూచించిందని, సినిమా కోసం చాలా బాగా పని చేస్తుందని కూడా తెలిపాడు.అలాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా నడుపుతుందని ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్లి సినిమా చూడాలని కోరాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నెల రెండవ తారీకున తమిళ, తెలుగు భాషల్లో సుల్తాన్ చిత్రం విడుదలైంది.కాగా ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోవడంతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది.
కాగా ప్రస్తుతం కార్తీ తమిళంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న “పొన్నియన్ సెల్వన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.అలాగే రష్మిక మందన కూడా తెలుగు, తమిళం, మలయాళం, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.