రంగస్థలంతో పాటు అంతకు ముందు సినిమాలతో వరుసగా సక్సెస్లు అందుకుంటూ వస్తున్న దర్శకుడు సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం కాలేదు.గత రెండు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ ఈయన సినిమా వాయిదా పడుతూ వస్తోంది.
రంగస్థలం చిత్రం తర్వాత మహేష్బాబుతో సినిమా చేయాలని సుకుమార్ అనుకున్నాడు.కథ కూడా సిద్దం చేసుకున్నాడు.
ఆరు నెలల తర్వాత మహేష్బాబుతో సినిమా లేదంటూ చెప్పారు.ఇప్పుడు మరో హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ సినిమా అఫిషియల్ అనౌన్స్ వచ్చింది.అయినా కూడా ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు.ఆరు నెలల కాలంగా సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్లో ఉండగానే సుకుమార్ సినిమాను కూడా మొదలు పెడతారని అంతా భావించారు.
కాని అనూహ్యంగా ఫలితం తిరగబడింది.
దర్శకుడు సుకుమార్తో హీరోలు ఆట ఆడేసుకుంటున్నారు.ఆయన్ను ఆపేస్తూ చేద్దాం అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.అల్లు అర్జున్ మొన్నటి వరకు చేద్దాం అంటూ జరుపుతూ వచ్చాడు.
ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమా ఫలితాన్ని బట్టి తన తదుపరి చిత్రం ఉంటుందని అంటున్నాడు.అంటే అల వైకుంఠపురంలో సినిమా ఫలితంను బట్టి సుకుమార్తో సినిమా చేయాలా వద్దా అంటూ నిర్ణయించుకుంటాడట.
మరి సుకుమార్ మరో హీరోను వెదుక్కుంటాడా లేదంటే బన్నీ కోసమే వెయిట్ చేస్తాడో చూడాలి
.