స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బన్నీ బాక్సాఫీస్ రికార్డులను తిరిగి రాశాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను ఇప్పటికే ప్రారంభించాడు బన్నీ.
కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్తో తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ తెరకెక్కి్స్తున్నాడు.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా కోసం సుకుమార్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న సుకుమార్, ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం సమయంలోనే సుకుమార్కు తన నెక్ట్స్ చిత్రానికి ఇంతమొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట.
అదే మాట మీద ఇప్పుడు పుష్ప చిత్రానికి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.కాగా ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.