తెలుగు సినీ దర్శకుడు సుకుమార్ గురించి అందరికీ తెలిసిందే.అంతే కాకుండా ఆయన రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
స్టార్ హీరోల సినిమాలలో దర్శకత్వం వహించి.మంచి విజయాన్ని అందించాడు.
అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్క సినిమాకు చాలా సమయాన్ని తీసుకోవడమే కాకుండా.తనకు నచ్చే వరకు కాస్త ఆలస్యమైనా సరే పట్టించుకోడు.
ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు ఆలస్యమైనా మంచి విజయాన్నే అందిస్తాయని నమ్మకం.
కానీ అదంతా ఒకప్పుడు అని ఇప్పుడు తన స్టైల్ మొత్తం మారిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకోకుండా మరీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో పుష్ప సినిమాలో దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేయడానికి ముందుగానే డేట్ ను అనౌన్స్ చేయగా.ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జోరుగా సాగుతుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే తన కూతురు కోసం షూటింగ్ కి సెలవు పెట్టాడట.బుధవారం రోజు సుకుమార్ కూతురు కి సంబంధించిన ఫంక్షన్ ఉండగా దాన్ని హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్లో జరిపారు.ఈ ఫంక్షన్ కు కొంతమంది నటీనటులు కూడా హాజరయ్యారు.ఈ ఫంక్షన్ కు కనీసం సుకుమార్ వారం రోజులైన సెలవు తీసుకోవాలి కానీ.ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున కేవలం ఒక్క రోజే సరిపెట్టుకున్నాడు.ఇక ఈ ఫంక్షన్ పూర్తయిన వెంటనే కేరళకు వెళ్లడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
ప్రస్తుతం పుష్ప సినిమా కేరళలో ఉండగా వెంటనే అక్కడ షూటింగ్ మొదలు పెట్టాలన్న ఆలోచనతో బిజీ బిజీ గా మారాడు.మొత్తానికి ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని సుకుమార్ నిర్ణయించుకున్నట్టున్నారు.