పుష్ప సినిమా షూటింగ్ 50 మందితోనే నడిపిస్తున్న సుకుమార్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాని తెరకెక్కి స్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మలయాళీ స్టార్ ఫాహద్ ఫైజల్ పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు .

 Director Sukumar Doing Pushpa Shooting With 50 Persons Crew, Tollywood, Allu Arj-TeluguStop.com

అతని పాత్ర పుష్ప సినిమాలో ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

రీసెంట్ గా వచ్చిన టీజర్ కి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ నేపధ్యంలో సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.ఇక షూటింగ్ కూడా మెజారిటీ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు కేవలం 50 మందితో మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లు అన్ని వాయిదా వేసుకున్నారు.50 మంది క్రూతో షూటింగ్ సాధ్యం కాదు కాబట్టి ఈ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గే వరకు ఆగాలని చాలా మంది భావిస్తున్నారు.అయితే సుకుమార్ మాత్రం పుష్ప షూటింగ్ వాయిదా వేయకుండా కొనసాగిస్తున్నారు.సినిమాకి అవసరమైన 50 మంది క్రూతోనే షూటింగ్ కి సంబంధించి కీలక సన్నివేశాలు అన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా మూవీకి 50 మంది క్రూతో షూటింగ్ అసలు సాధ్యమయ్యే అవకాశమే లేదని, సుకుమార్ టీమ్ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎక్కువ మందితో చిత్రీకరణ చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది.అయితే ఫారెస్ట్ లో షూటింగ్ కావడంతో చిత్ర యూనిట్ మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోట ఉంటూ షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు తీసుకున్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube