బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న అందాల భామ కృతి సనన్.ఈ అమ్మడు ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.దీంతో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్ట్ లు కృతి సనన్ చేతిలో ఉన్నాయి.ఇదిలా ఉంటే కెరియర్ ఆరంభంలో ఈ బ్యూటీ తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో నేనొక్కడినే మూవీలో మహేష్ బాబుకి జోడీగా నటించింది.
ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.తరువాత నాగ చైతన్యకి జోడీగా దోచేయ్ అనే మూవీ కూడా చేసింది.
ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.
అదే సమయంలో బాలీవుడ్ లో హిట్ సినిమాలతో బిజీ అయిపొయింది.ఇదిలా ఉంటే మళ్ళీ ఇప్పుడు సుకుమార్ ఈ భామని తెలుగులోకి తీసుకురావడానికి ప్రయ్తఃనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
పుష్ప సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్.
అలాగే ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథగా ఈ సినిమాని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఆమెకి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని, ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకొని చేయడానికి మొగ్గు చూపుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.