బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పుష్ప టీం సందడి చేసింది.క్రిస్ మస్ కానుకగా రావాల్సిన ఈ షో స్ట్రీమింగ్ నెక్స్ట్ డే వచ్చింది.
బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పుష్ప డైరక్టర్ సుకుమార్, రష్మిక మొదట సందడి చేయగా ఆ తర్వాత అల్లు అర్జున్ వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.ఇక ఈ ప్రోగ్రాం లో భాగంగా సుకుమార్ తో బాలకృష్ణ సినిమా చేస్తానని అన్నారు.
తనతో సినిమా అంటే 3 నెలల్లో పూర్తి చేయాలని అన్నారు.
దసరాకి కొబ్బరికాయ.
క్రిస్ మస్ కి షూటింగ్.సంక్రాంతికి రిలీజ్ అని అన్నారు బాలయ్య.
నాతో సినిమా 3 నెలల్లో రిలీజ్ చేయాల్సిందే.ఆ విషయంలో తగ్గేదేలే అన్నారు బాలకృష్ణ.
అన్ స్టాపబుల్ షోలో బాలయ్య తన హ్యూమర్, కామెడీ అంతా పండించేస్తున్నారు.ఈ షో ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఒకవేళ నిజంగానే సుకుమార్ బాలకృష్ణ కు తగిన కథతో వస్తే మాత్రం ఈ కాంబో లెక్క వేరే ఉంటుందని చెప్పొచ్చు.ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకుల్లో తన స్టైల్ తో సినిమా చేస్తున్నారని సుకుమార్ గురించి గొప్పగా చెప్పారు బాలయ్య.
అన్ స్టాపబుల్ ఇన్ని ఎపిసోడ్స్ లో పుష్ప టీం తో చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది.షో మొత్తం మీద ఇది మన సినిమా కాదు.
మ డైలాగ్ కాదు అన్న భావన లేకుండా తగ్గేదేలే అని బాలయ్య చాలాసార్లు అనడం బన్నీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.