టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ అందరి హీరోలాల కాకుండా తనకంటూ ప్రత్యేకమైన జోనర్ క్రియేట్ చేసుకొని కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ హీరోగా తన మార్క్ చూపించుకుంటున్నాడు.కెరియర్ ఆరంభంలో కాస్తా మాస్ హీరో ఇమేజ్ కోసం వయసుకి మించి వేషాలు వేసిన ఇప్పుడు మాత్రం థ్రిల్లర్, డార్క్ స్టోరీస్ తో టాలీవుడ్ లో నిఖిల్ వరుస హిట్స్ కొట్టాడు.
అయితే అర్జున్ సురవరం సినిమా రిలీజ్ వాయిదాల కారణంగా కొంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా నిఖిల్ ఈ సినిమా రిలీజ్ తో మరల ఫ్రేమ్ లోకి వచ్చాడు.ప్రస్తుతం అర్జున్ సురవరం హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు నిఖిల్ అదిరిపోయే అవకాశం కొట్టేసాడు.గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 లో సినిమా చేస్తున్నాడు.
అది కూడా స్టార్ దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ వర్క్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న సినిమాలో.కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.
సిచి త్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసి సినిమాని ప్రకటించింది.ఇక ఈ సినిమాకి సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.ఇక ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో పట్టాలెక్కుతోంది అని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.మరో ఎక్కువగా డార్క్ సైడ్ సినిమాలు చేసే నిఖిల్ ని ఇప్పుడు సుకుమార్ కథ ఎలా చూపించబోతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది.