స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో పుష్ప ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాను పూర్తి రివెంజ్ డ్రామాగా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.ఎర్రచందన స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో వస్తున్న ఈ సినమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్న ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నాడు.
అంతేగాక ఈ సినిమా షూటింగ్ విషయంలో సుక్కు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లోనే ముగించేయాలని సుకుమార్ భావిస్తున్నాడట.ఎలాంటి బ్రేకులు లేకుండా ఈ సినిమా షూటింగ్ను జరిపి ఆరు నెలల్లో షూటింగ్ ముగించేయాలని పక్కా ప్లానింగ్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చిందని, ఇకపై ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేయాలని ఆయన నిర్ణయించాడు.
బన్నీని చాలా రఫ్ లుక్లో చూపించనున్న ఈ సినిమా మెజారిటీ షూటింగ్ అడవి బ్యాక్డ్రాప్లో జరగనుంది.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.
ఈ సినిమాలో పలువురు ట్యాలెంటెడ్ నటులు కూడా నటిస్తోండగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు సుకుమార్.మరి సుక్కు ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.