టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.అంతే కాకుండా రచయితగా కూడా మంచి సినిమాలను తెరకెక్కించాడు.
ఈయన దర్శకత్వం తో స్టార్ హీరో సినిమాలు మంచి విజయాన్ని అందించాయి.అంతేకాకుండా మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో తెరకెక్కించిన సినిమా రంగస్థలం.
ఈ సినిమా సుకుమార్ కెరీర్ లో మంచి విజయాన్నే సాధించింది.
ఇదిలా ఉంటే రంగస్థలం సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు సుకుమార్.
వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో సుకుమార్ కొన్ని విషయాలు తెలుపుతూ మరో సినీ డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా కు తనకు మధ్య మంచి అనుబంధం ఉందని.అంతేకాకుండా తెలుగు హీరోయిన్ల గురించి కొన్ని విషయాలు తెలిపాడు.
ఆయన తన సినిమాలో తెలుగు హీరోయిన్ లను తీసుకోవడానికి ఓ కారణం ఉందట.ప్లే బ్యాక్ సినిమాల్లో అనన్య నాగల్లా అద్భుతంగా నటించిందంటూ అందుకే ఆయన కూడా తెలుగు హీరోయిన్ లనే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడట.
అందుకే ఆయన తన సినిమాలలో ఎక్కువ తెలుగు హీరోయిన్ల కే ఆసక్తి చూపుతారట.
సుకుమార్ దర్శకత్వంలో ఎక్కువ డైలాగులు వెంట వెంటనే మారడంతో.
ముందు చెప్పిన డైలాగులకు పొంతన ఉండకపోవడంతో తెలుగు రాని హీరోయిన్ లను తీసుకుంటే కాస్త ఆలస్యం అవుతుందని తెలిపాడు.అదే తెలుగు అమ్మాయిల ను తీసుకుంటే వెంటనే డైలాగులను క్లారిటీ గా చెప్పేస్తారని అన్నారు.
అందుకే ఇలాంటి సమస్యలు ఎదురు కావొద్దని రంగస్థలంలో సమంతను తీసుకున్నామంటూ చెప్పారు.తనకు తెలుగు వచ్చు కాబట్టి ఇ డైలాగ్ మారుతున్న కొద్దీ తాను వెంటనే నేర్చుకొని చెప్పేస్తుందట తెలిపాడు.ఇక ప్రస్తుతం పుష్పా సినిమా దర్శకత్వం లో బిజీగా ఉన్నా ఈయన ఈ సినిమా కోసం ముందు తెలుగు అమ్మాయినే తీసుకుందామని అనుకున్నారట.కాని కుదరక తెలుగు వచ్చిన రష్మిక మందన్నా ను తీసుకున్నామని తెలిపాడు
.