కేవలం ఒకే ఒక్క సినిమాతో తన సత్తా ఏమిటో నిరూపించిన డైరెక్టర్లలో సుజిత్ ఒకరు.శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ చిత్రంతో తనలోని ట్యాలెంట్ను ఆడియెన్స్కు పరిచయం చేశాడు ఈ డైరెక్టర్.
ఆ సినిమా సాధించిన విజయంతో ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సాహో లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు సుజిత్.అయితే అదంతా సాహో రిలీజ్ కాకముందు వరకే ఉంది.
అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేయడంతో ఈ డైరెక్టర్పై విరుచుకుపడ్డారు ఆడియెన్స్.సినిమా తీయడమే రాదంటూ సుజిత్ను నానా మాటలు అన్నారు క్రిటిక్స్.
ఇక ఈ దెబ్బ నుండి కోలుకున్న సుజిత్ తన నెక్ట్స్ సినిమాను రెడీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.తన ట్యాలెంట్ను నిరూపించుకోవడంలో కీలక పాత్ర పోషించిన రన్ రాజా రన్ చిత్ర హీరో శర్వానంద్తో కలిసి తన నెక్ట్స్ సినిమాను రెడీ చేస్తున్నాడు ఈ కుర్ర డైరెక్టర్.
రన్ రాజా రన్ చిత్రం యొక్క స్క్రీన్ప్లే ఆ సినిమాకు ఎలాంటి బలాన్ని అందించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు అదే ఫార్మాట్ కథతో మరోసారి తన సత్తా చాటుకునేందుకు రెడీ అవుతున్నాడు సుజిత్.
మరి సాహో దెబ్బ నుండి సుజిత్ను రన్ రాజా రన్ హీరో ఎంతమేర బయటపడేయగలడు అనేది ఆసక్తి అంశంగా మారింది.