టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రియా తాజాగా నటించిన సినిమా గమనం.
ఈ సినిమాకు సుజనా రావు దర్శకత్వం వహించారు.ఈ సినిమాతో సుజనా రావు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.
ఇందులో నిత్యామీనన్, శ్రియా , శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, చారుహాసన్ పలువురు నటించారు.ఈ సినిమా డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు సుజనా రావు మాట్లాడుతూ.చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ గమనం కథను రాశాను అని తెలిపారు.
పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్ సర్కిల్ ను చూపించాలని అనుకున్నాను.ఇందులో నటించిన సెలబ్రిటీలతో కలిసి పని చేయడం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని తెలిపారు.
అలాగే ఇందులో శ్రియా మాత్రం చాలా కొత్తగా కనిపిస్తారు.ప్రతి ఒక్కరూ కూడా ఆమెతో ప్రేమలో పడిపోతారు.
స్క్రిప్ట్ ను రాసినప్పుడు ఆ పాత్రలకు ఫలానా వారు అని నేను అనుకోలేదు.శ్రియా దగ్గరకు వెళ్లి ఈ సినిమాలో కమల పాత్ర గురించి చెప్పాను.
కథ చెప్పడం పూర్తి అయిన తర్వాత శ్రియా శరణ్ అలా లేచి గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేశారు.అనంతరం ఈ కథను నిత్యామీనన్ గారికి కూడా చెప్పడంతో ఆమె కూడా అందుకు ఒప్పుకొని ఎప్పుడు రావాలో చెప్పండి అప్పుడు వచ్చి చేస్తాను అని అన్నారని తెలిపింది.మొదట చిన్న సినిమాగానే అనుకున్నాం కానీ యాక్టర్స్ వచ్చిన తర్వాత అది పెద్ద సినిమా అయ్యింది.జీవితం ప్రయాణం గురించి చెప్పడమే గమనం సినిమా.ఇందులో ప్రతి ఒక పాత్రకు ఒక జర్నీ ఉంటుంది అని చెప్పుకొచ్చారు సుజనా రావు.