ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబాన్ల వశం అయిన సంగతి తెలిసిందే.20 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్య పాలన జరిగిన ఆఫ్ఘనిస్తాన్ లో.ఉన్న ప్రభుత్వాన్ని రోజుల వ్యవధిలోనే తాలిబాన్లు…కూల్చేసి తమ ప్రభుత్వాన్ని మళ్లీ స్థాపించారు.ఈ క్రమంలో ఇప్పటికే కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్న తాలిబాన్లు మరొకపక్క తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని మట్టుపెట్టుకుంటూ పోతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఆఫ్గనిస్థాన్ దేశంలో ఆత్మాహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కుందుజ్ మసీద్ లో… తాజాగా ఆత్మాహుతి దాడులు జరపగా.100 మంది ప్రజలు మృతి చెందారు.దాడి జరిగిన సమయంలో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఉండటంతో.
భారీగా మరణాల సంఖ్య పెరగటంతో పాటు అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.ఇదిలా ఉంటే తాలిబాన్లు దేశాన్ని అదుపులోకి తీసుకున్న తరువాత జరిగిన అనేక దాడులలో.
అతి పెద్ద దాడి ఇదే అని అక్కడ మీడియా వర్గాలు అంటున్నాయి.ఆత్మాహుతి దాడికి మసీదు లోపల శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉన్నట్లు… అనేకమంది ఆర్తనాదాలు చేస్తున్నట్లు.
మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.