ఇదో దారుణం.ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా…సరైన కౌన్సిలింగ్ ఇస్తున్నా.
ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.వివరాల్లోకి వెళితే.
సమాజంలో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉన్నారు.అయితే ఈ మధ్య కాలంలో సమాజంలో యువత పెడదోవ పడుతూ ఉండటం సర్వ సాదారణంగా మారిపోయింది… ఇదే క్రమంలో.
కొంత మంది ఉగ్రవాదం వైపు మళ్లుతుంటే సొసైటీలో ఉంటూ మరికొంత మంది ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు.ఇక అమెరికాలో మిస్సోరి రాష్ట్రంలో.
టైరోన్ పట్టణంలో ఒక ఉన్మాది రెచ్చిపోయాడు…విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు, దాని ఫలితంగా తొమ్మిది మంది, అమెరికన్ పోలీసుల సమాచారం ప్రకారం…ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 9 మందిని కాల్చి చంపి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.కాల్పులు జరిపిన అనుమానితుడి మృతదేహాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనంలో గుర్తించామని పోలీసులు తెలిపారు.
నాలుగు ఇళ్లలో బాధితుల మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు వెల్లడించారు.ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలను అరికట్టే చర్యల పై ప్రభుత్వం, సమాజం మరింత దృష్టి పెట్టాలి అని తెలుస్తుంది.