ఈవెంట్ ఏదైనా ఎంజాయ్ మెంట్ ఎక్కడైనా స్టేజ్ ఎక్కారంటే కుళ్లు కామెడీ చేయాల్సిందే.ఇప్పుడు ఈవెంట్ జరిగే పరిస్థితి చూస్తుంటే ఇలానే ఉంది.
ఇక సినిమా ప్రోగ్రామ్స్ అయితే సరేసరి.కొందమంది కమెడియన్స్ తో సెన్సార్ లేని డైలాగులతో రోత కామెడీని పండించి అదే హాస్యం అన్నట్టు నవ్వుల జల్లులు కురిపిస్తున్నారు.
అయితే ఇది ఈరోజు నుండి జరుగుతున్నది కాదు.హాస్యం అపహాస్యం అయిన రోజు నుండి ఈవెంట్ జరుగుతున్న స్టేజ్ మీద కుళ్లు జోకులు వేస్తుండటం దాన్ని కామెడీ అంటూ సర్ధేయడం జరుగుతుంది.
అయితే దీనికి ఎంతగా హర్ట్ అయ్యిందో తెలియదు కాని సీనియర్ హీరోయిన్, మణిరత్నం సతీమణి సుహాసిని.రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్ వేడుకలో ఈవెంట్ మేనేజర్లకు.
ఇంకా స్టేజ్ మీద కామెడీలు చేసే వారికి పంచ్ ఇచ్చింది.మీరు చేసే కార్యక్రమాలు అంతా బాగుంటున్నాయి కాని మహిళలను, పిల్లలను కించ పరచకుండా వారిపై కుళ్లు జోకులు వేయకుండా ఉంటే మంచిందన్నది.
అలా ఆడవాళ్ల మీద పిల్లల మీద జోకులు వేయడం అంత మంచి పద్ధతి కాదని ఓ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టే అనిపించింది.
ఈ మధ్య స్టేజ్ ఎక్కిన ప్రతి కమెడియన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
మరి అలాంటి వాటికి ఎంతగానో హర్ట్ అయిన సుహాసిని ఇలా సైమా అవార్డ్ వేడుకలో తన మనసులోని మాటను బయట పెట్టింది.