హృదయ కాలేయం కొబ్బరి మట్ట వంటి విభిన్న కామెడీ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయి రాజేష్ నిర్మాణంలో రూపొందిన కొత్త సినిమా కలర్ ఫోటో.ఈ సినిమాలో హీరోగా సుహాస్ హీరోయిన్ గా ఛాందిని చౌదరి నటించారు.
ఈ సినిమాను ఆహా ద్వారా డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గా ఇటీవలే ప్రకటించారు.ముందుగా చెప్పిన ప్రకారం అక్టోబర్ 8 వ తారీఖున అంటే రేపు ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉంది.
కానీ చివరి నిమిషంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వని కారణంగా సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఆహాలో రేపటి నుంచి స్ట్రీమింగ్ అవ్వాల్సిన కలర్ ఫోటో సినిమాను దసరా కానుకగా ఈ నెల 23వ తారీఖున స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నట్లు గా పేర్కొన్నారు.
ఈ సినిమా లవ్ స్టోరీ చాలా విభిన్నంగా ఉంటుందని ట్రైలర్ మరియు టీజర్ చూస్తే అనిపిస్తుంది.
సినిమా లో హీరో కలర్ నల్లగా ఉంటుంది హీరోయిన్ తెల్లగా ఉంటుంది.
ఇద్దరికీ లవ్ ఎలా సెట్ అయింది అనేదే కథాంశం గా తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతుందని మరికొన్ని రోజుల్లోనే పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేసి దసరా కానుకగా విడుదల చేస్తామన్నారు.
ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం చేస్తున్నట్లు నిర్మాత సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా పట్ల అల్లు అరవింద్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
అందుకే కాస్త ఎక్కువైనా కూడా ఆహా కోసం ఈ సినిమా రైట్స్ ను ఆయన కొనుగోలు చేశాడు.ఈ సినిమాతో చాందినీ చౌదరి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సుహాస్ కూడా ఫుల్ టైమ్ హీరో గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఈ సినిమా వారిద్దరికీ చాలా కీలకం గా మారబోతుంది.
లాక్ డౌన్ తర్వాతే ప్రారంభమైన ఈ సినిమా చాలా స్పీడ్ గా తెరకెక్కింది.విడుదల విషయంలో మాత్రం కాస్త జాప్యం జరుగుతోంది.