తెలుగు బుల్లితెర పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే సుడిగాలి సుదీర్ ఈ మధ్యకాలంలో పలురకాల షోలు, ఈవెంట్లు మరియు జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లు వంటివి చేస్తూ టాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే గతంలో సుడిగాలి సుధీర్ ఓ గుర్తు తెలియని వింత వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడని, ఈ వ్యాధి కారణంగా అప్పుడప్పుడు పలు రకాల మానసిక రుగ్మతలకు గురయ్యేవాడని కొందరు సోషల్ మీడియాలో బలంగా చర్చించుకుంటున్నారు.
అలాగే ఈ వ్యాధి గురించి వైద్యులను సంప్రదించడంతో ఈ మధ్య కాలంలో కొంతమేర ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలిగి సుధీర్ కోలుకున్నట్లు సమాచారం.అయితే ఈ విషయం తెలుసుకున్న సుడిగాలి సుదీర్ అభిమానులు ఆందోళనకు చెందుతున్నారు.
అంతే గాక ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించినటువంటి “సాఫ్ట్ వేర్ సుదీర్” అనే చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం సాధించలేక పోయింది.కాగా ప్రస్తుతం సుడిగాలి సుధీర్ మరియు టాలీవుడ్ బ్యూటిఫుల్ కర్ రయాంష్మి గౌతమ్ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఈ విషయంపై ఇటు సుడిగాలి సుదీర్ గానీ అటు రష్మీ గౌతమ్ గానీస్పందించడం లేదు.దీంతో సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ కలిసి నటిస్తున్నారనే వార్తలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.