బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ సెన్స్ గురించి అందరికీ తెలిసిందే.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం నుండి పరిచయమైన సుధీర్.
ఆ ప్రోగ్రాం లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆ తర్వాత వెండితెర లో కూడా పలు సినిమాలలో నటించి బాగా ఆకట్టుకున్నాడు.
అంతేకాకుండా ప్రస్తుతం పలు షోలలో తెగ బిజీగా ఉన్నాడు సుధీర్.
ఇక ఈటీవీ ప్లస్ లో పోవే పోరా షో లో యాంకర్ గా చేసి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.
ఇక ఢీ డాన్స్ షో లో రష్మీ తో కలిసి యాంకరింగ్ తో బాగా మెప్పిస్తున్నాడు.ఇదిలా ఉంటే ప్రోగ్రామ్ లలో సుధీర్ ఉంటేనే ఆ ప్రోగ్రాం కాస్త ఎంటర్ టైన్ గా ఉంటుందని ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ అలనాటి డాన్సర్ లతో డాన్స్ చేస్తూ తెగ ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే.ఇందులో తాజాగా అలనాటి హీరోల సరసన నటించిన ఒకప్పటి డ్యాన్సర్లు ఈ షోలో పాల్గొని తమ డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకున్నారు.ఈ వయసులో కూడా వీరి ఎనర్జీ ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఇక వారంతా 60 ఏళ్ల పైగా ఉండగా..
వాళ్లతో కలిసి సుడిగాలి సుధీర్.ఆచార్య సినిమా లోని ఇటీవల విడుదలైన లాహే.లాహే.పాటకు డాన్స్ చేశాడు.
వాళ్లతో కలసి చిరంజీవి స్టెప్పులు వేస్తూ బాగా ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.
వాళ్ళ ఎనర్జీని చూసి అందరు షాక్ అవుతూ.ప్రశంసలు కురిపిస్తున్నారు.